అక్షరశక్తి, గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పొనుగోడు గ్రామానికి చెందిన ముత్యం నర్సయ్య అనే రైతు తనకు ఉన్నటువంటి రెండెకరాల భూమిలో మొక్కజొన్న పంటను సాగు చేసుకుంటున్నాడు. మూడు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలు, వడగండ్ల వానతో మొక్కజొన్న చేను నేలమట్టం అయింది. దీంతో ముత్యం నర్సయ్య-సోమక్క దంపతులు మొక్కజొన్న చేనులో కూర్చొని రోదించారు. పంట మొత్తం నేలకూలడంతో ఆ కుటుంబం దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి అధికారులతో తమను ఆదుకోవాలని రైతు దంపతులు వేడుకుంటున్నారు.