Saturday, July 27, 2024

తెలంగాణ‌లో బీజేపీకి భారీ షాక్

Must Read
  • క‌మ‌లం పార్టీకి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా
  • ఎల్లుండి కాంగ్రెస్‌లో చేరిక‌

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్‌: తెలంగాణ‌లో బీజేపీకి గ‌ట్టి షాక్ త‌గిలింది. అసెంబ్లీ ఎన్నికల వేళ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కమలం పార్టీకి బైబై చెప్పారు. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీకి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ప్రకటించిన ఫస్ట్ లిస్ట్‌లో ఆయన పేరు లేకపోవడంతోనే పార్టీ మారబోతున్నారంటూ ఊహాగానాలు వినిపించాయి. ఆ వార్తలను నిజం చేస్తూ రాజగోపాల్‌రెడ్డి బీజేపీకి రాజీనామాను ప్రకటించారు. మళ్లీ ఆయన సొంత గూటికే వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఎల్లుండి ఢిల్లీలో సోనియాగాంధీ, రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా క‌ప్పుకోను న్నారు. 2018 ఎన్నికల్లో మునుగోడు నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తదనం తర పరిణామాలతో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. తర్వాత జరిగిన మునుగోడు బైపోల్స్‌లో బీజేపీ నుంచి పోటీ చేసి అపజయం పాల‌య్యారు. దీంతో అప్పటి నుంచి ఆయన బీజేపీతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. తాజా రాజకీయ పరిణామాలతో తిరిగి సొంత గూటికి చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఈమేర‌కు బీజేపీకి రాజీనామా చేస్తూ రాజగోపాల్‌రెడ్డి పత్రికా ప్రకటన విడుదల చేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img