Saturday, July 27, 2024

కొవిడ్‌కు మ‌రో రెండు ఔష‌ధాలు

Must Read

క‌రోనా వైర‌స్ బాధితుల‌కు చికిత్స అందించ‌డానికి ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ మ‌రో రెండు ఔష‌ధాల‌కు ఆమోదం తెలిపింది. రూమటైడ్‌ కీళ్ల నొప్పుల నివారణకు ఎలి లిల్లీ కంపెనీ తయారు చేసిన మెడిసిన్, గ్లాక్సోస్మిత్‌క్లేన్‌ కంపెనీ మోనో క్లోనల్‌ యాంటీబాడీ థెరపీలను క‌రోనా రోగులకు ఇవ్వడానికి డబ్ల్యూహెచ్‌వో అంగీక‌రించింది. లిల్లీ కంపెనీకి చెందిన బారిక్టినిబ్‌ ఔషధం కరోనా నుంచి ప్ర‌జ‌ల ప్రాణాలు కాపాడుతుందని, వారికి వెంటిలేటర్‌ అవసరం లేకుండా చేస్తుందని డబ్ల్యూహెచ్‌వో శుక్రవారం పేర్కొంది.

స్టెరాయిడ్స్‌తో పాటు కీళ్ల నొప్పులకు వాడే ఈ ఔషధాన్ని ఇస్తే మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపింది. కాగా, ఇప్పటికే బారిక్టినిబ్‌ను అమెరికా, యూరప్‌లలో గత ఏడాది మే నుంచి అత్యవసర సమయాల్లో వినియోగిస్తున్నారు. కరోనాతో ఇబ్బంది పడుతూ ఆస్పత్రిలో చేరే అవసరం ఉన్న వారికి గ్లాక్సో కంపెనీకి చెందిన మోనోకల్నల్‌ యాంటీబాడీ ట్రీట్‌మెంట్‌ ఇవ్వొచ్చునని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌ స్పష్టం చేసింది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img