అక్షరశక్తి, వరంగల్ : ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో మేడారం సమ్మక్క-సారలమ్మ దర్శనానికి వచ్చిన ఒక గుర్తుతెలియని వ్యక్తి జంపన్నవాగు సమీపంలో ఫిట్స్ వచ్చి మృతి చెందాడు. మృతుడి దగ్గర ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతుడు నీలం రంగు గీతల చొక్కా, బూడిద రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. మృతుడికి సుమారు 60 ఏళ్ల వయస్సు ఉంటుంది. మృతుడి శవాన్ని ఏటూరునాగారం మార్చురీకి తరలించామని, మృతుడికి సంబంధించిన వారెవరైనా ఉంటే తాడ్వాయి పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని ఎస్.ఎస్ తాడ్వాయి పోలీస్ స్టేషన్ ఎస్సై సీఎచ్.వెంకటేశ్వరరావు తెలిపారు.